నెన్నెల: సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఎంపికై న నందులపల్లి గ్రామ పంచాయతీ లో అభివృద్ధి పనులను పంచాయతీరాజ్ డె ప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బోర్వెల్ రీచా ర్జ్, ఇంకుడుగుంతలు, ఫారంఫండ్, జలశ్రీ కార్యక్రమం కింద చేపడుతున్న పనులపై అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పారిశుద్ధ్యం, పచ్చదనం, గ్రామమౌలిక సదుపాయల అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించారు. క్షేత్ర స్థా యిలో పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు ప ర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. డీపీఓ కిషన్, ఏపీడీ శ్రీని వాస్, ఐఈసీ నోడల్ ఆఫీసర్ సదా నందం, డీఏఓ సురేఖ, ఎంపీడీఓ పూర్ణచందర్రావు, ఎంపీఓ శ్రీనివాస్, ప్లానిటేషన్ మేనేజర్ శ్రీని వాస్, ఏపీఓ నరేష్, సర్పంచ్ వనిత, ఉపసర్పంచ్ గజేందర్సింగ్, కార్యదర్శి సరిత పాల్గొన్నారు.


