కళాశాల ముందు ఆర్టీసీ బస్సు ఆపాలి
మంచిర్యాలఅర్బన్: జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు ఆర్టీసీ బస్సు ఆపాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్యూ) ఆధ్వర్యంలో మంచిర్యాల ఆర్టీసీ డిపో కార్యాలయంలో అసిస్టెంట్ డిపో మేనేజర్ శ్రీలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ మాట్లాడుతూ జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 160 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. కళాశాల ముందు ఆర్టీసీ బస్సు ఆపకపోవడంతో అమ్మాయిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పీడీఎస్యూ జిల్లా కోశాధికారి జి.సౌమ్య, అంజలి, అను పాల్గొన్నారు.


