ప్రతిఒక్కరూ సన్మార్గంలో నడవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతిఒక్కరూ సన్మార్గంలో నడవాలి

Jan 5 2026 11:29 AM | Updated on Jan 5 2026 11:29 AM

ప్రతిఒక్కరూ సన్మార్గంలో నడవాలి

ప్రతిఒక్కరూ సన్మార్గంలో నడవాలి

● త్రిదండి దేవనాథ్‌ రామానుజ జీయర్‌ స్వామి

జైనథ్‌: ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని త్రి దండి దేవనాథ్‌ రామానుజ జీయర్‌ స్వామి అ న్నారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం వికాస తరంగణి ఆధ్వర్యంలో మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనుర్మాసంలో సూర్యుడు ధనురాశిలో ఉండడంతో ఈ వ్రతాన్ని ధనుర్మాస వ్రతం అని అంటారన్నారు. ఈ వ్రతాన్ని ఆచరించిన మహిళల కుటుంబాల్లో సుఖశాంతులు నెలకొంటాయన్నారు. లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి అధ్యక్షుడు హనుమంతరావు, సభ్యులు రాజేశ్వర్‌, బాలకిషన్‌, సర్పంచ్‌ గడ్డం మమత జగదీ ష్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ అడ్డి రుకేష్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అల్లూరి అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement