రైలు నుంచి జారిపడి యువకుడికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడి యువకుడికి గాయాలు

Aug 18 2025 5:39 AM | Updated on Aug 18 2025 5:39 AM

రైలు నుంచి జారిపడి  యువకుడికి గాయాలు

రైలు నుంచి జారిపడి యువకుడికి గాయాలు

తాండూర్‌: గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి యువకుడు గాయాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రం కొత్తపల్లి వారసంత సమీపంలోని రైల్వేట్రాక్‌పై రైలులో హైదరాబాద్‌కు చెందిన మహేశ్‌ జారిపడటంతో గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్లే క్రమంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని యువకుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం తాండూర్‌ పీహెచ్‌సీకి తరలించి వైద్యం అందించారు. 108 ఈఎంటీ ప్రశాంత్‌, పైలెట్‌ అన్నం తిరుపతి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement