పాలమూరులో అనంత పద్మనాభుడి సెట్టింగ్లో..
జడ్చర్లలో పసుపు కొమ్ముల గణపతి
జడ్చర్ల గంజ్ ఏరియాలో మంచు గణపతి
ఎర్రవల్లిలో దినపత్రికల గణపయ్య
పాలమూరులో బంగారు ఆభరణాలతో విగ్రహం
ఉమ్మడి పాలమూరులోని పలు ప్రాంతాల్లో వినాయక చవితి వేళ గణనాథులు విభిన్న రూపాల్లో కొలువుదీరారు. అమర్నాథ్ శివలింగం ఆకృతిలో పసుపు కొమ్ములతో రూపొందించిన వినాయకుడితో పాటు పూలు, పేపర్లు, బంగారంతో ప్రత్యేకంగా తయారు చేసిన గణనాథులను మండపాల్లో ప్రతిష్టించారు. రంగురంగుల అలంకరణల నడుమ కొలువైన ఈ విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ సృజనాత్మకతకు పదునుపెట్టి రూపొందించిన గణనాథులను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ వేడుకలు నిర్వహించారు. – సాక్షి నెట్వర్క్


