ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

May 27 2024 11:10 PM | Updated on May 27 2024 11:10 PM

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ప్రస్తుత సాంకేతిక జీవనంలో మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక చింతన మనిషికి ఎంతో అవసరమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రం 9వ వార్డు పరిధిలోని పాలకొండలో నూతనంగా నిర్మించిన చౌడేశ్వరిమాత ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌడేశ్వరిమాత ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఆలయ అభివృద్ధికి అన్నివిధాలా తోడ్పాటు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు లక్ష్మణ్‌యాదవ్‌, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, శివుడు, ఆంజనేయులు, శ్రీను, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement