ఉద్యోగులు తమ కార్యాలయంలో ఏదైనా ప్రత్యేక సమావేశం లేదా.. కార్యక్రమం ఉన్నప్పుడు నిర్ణీత సమయంకంటే ముందు లేదా.. రెగ్యులర్ టైమ్కు ఆఫీస్కు రావాల్సిందే.. కానీ, మానుకోట కలెక్టరేట్ ఉద్యోగులు మాత్రం రైలు ఎప్పుడొస్తే.. ఆఫీస్కు అప్పుడే వస్తామంటున్నారు.. గురువారం ఉదయం 9:45 గంటలకు కలెక్టరేట్లో ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రు నాయక్ ముఖ్య అతిథిగా ప్రజా పాలన దినోత్సవం ముగిసిన అరగంట తర్వాత సుమారు 11:15 గంటలకు కలెక్టరేట్ ఉద్యోగులు కార్యాలయానికి రావడం గమనార్హం. అదేంటని అడిగితే ‘మేము వరంగల్ నుంచి వస్తున్నాం.. కృష్ణ ఎక్స్ ప్రెస్ ఇప్పుడే వచ్చింది’అని సమాధానమిచ్చారు.
– సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్


