జిల్లాలోని 18 మండలాల పరిధిలో 21 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, మహబూబాబాద్లో జనరల్ ఆస్పత్రి, గూడూరు, గార్ల, తొర్రూరు, మరిపెడ ప్రాంతాల్లో సీహెచ్సీలు ఉన్నాయి. అయితే ఇందులో మహబూబాబాద్, గూడూరు ఆస్పత్రుల్లో మాత్రమే పోస్టుమార్టం చేస్తున్నారు. గార్లలో సెంటర్ ఏర్పాటు చేసినా.. వసతులు, ఫ్రీజర్ బాక్స్లు లేకపోవడంతో అక్కడ పోస్టుమార్టం చేయడం లేదు. అయితే మహబూబాబాద్లో రెండు ఫ్రీజర్ బాక్స్లు ఉండగా.. అందులో ఒకటి పూర్తిగా పాడయ్యింది. మరొకటి ఉన్నా అంతంత మాత్రంగానే పని చేస్తోందని బాధితులు చెబుతున్నారు. దీంతో పలు సందర్భాల్లో శవాలను స్ట్రెచర్ మీదనే పెట్టి గదిలో పెడుతున్నారు.


