దర్శనాల నిలిపివేత.. ఆరుబయట పూజలు | - | Sakshi
Sakshi News home page

దర్శనాల నిలిపివేత.. ఆరుబయట పూజలు

Dec 25 2025 8:33 AM | Updated on Dec 25 2025 8:33 AM

దర్శన

దర్శనాల నిలిపివేత.. ఆరుబయట పూజలు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు బుధవారం భక్తులు మేడారానికి భారీగా తరలివచ్చారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ధ్వజ స్తంభాల పున:ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా పూజారులు దర్శనాల నిలిపివేత ప్రకటించిన విషయం తెలిసిందే. సమాచారం అందని భక్తులు వంద సంఖ్యలో మేడారానికి తరలివచ్చారు. పూజా కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి భక్తులను గద్దెల వద్దకు రాకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో భక్తులు బయటనే అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుని పక్కనే ఉన్న చెట్టు వద్ద పసుపు, కుంకుమ, ఒడిబియ్యం సమర్పించి తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. దీంతో భక్తులు సమ్మక్క–సారలమ్మ గద్దెలతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. పస్రా సీఐ దయాకర్‌, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి, పోలీసులు పూజా కార్యక్రమాలు పూర్తయ్యే వరకు భక్తులను గద్దెల ప్రాంగణంలో రాకుండా చర్యలు తీసుకున్నారు.

దర్శనాల నిలిపివేత.. ఆరుబయట పూజలు1
1/1

దర్శనాల నిలిపివేత.. ఆరుబయట పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement