రైతును బురిడీ కొట్టించి రూ.40 వేలు డ్రా.. | - | Sakshi
Sakshi News home page

రైతును బురిడీ కొట్టించి రూ.40 వేలు డ్రా..

Dec 25 2025 8:33 AM | Updated on Dec 25 2025 8:33 AM

రైతును బురిడీ కొట్టించి రూ.40 వేలు డ్రా..

రైతును బురిడీ కొట్టించి రూ.40 వేలు డ్రా..

వర్ధన్నపేట: ఏటీఎం కేంద్రంలో ఓ రైతును దుండగుడు బురిడీ కొట్టించాడు. రైతు ఏటీఎం కార్డు మార్చి రూ.40 వేలు డ్రా చేసుకుని పరారయ్యాడు. ఈ ఘటన బుధవారం వర్ధన్నపేటలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన రైతు పిన్నింటి కిషన్‌రావు తన ధాన్యం డబ్బులు ఖాతాలో జమ కావడంతో ఎస్‌బీఐకి వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవడానికి అధికారులను సంప్రదించాడు. అయితే బ్యాంకులో డబ్బులేదని ఏ టీఎం ద్వారా డ్రా చేసుకోవాలని వారు సూచించారు. కిషన్‌రావుకు ఏటీఎం వినియోగం తెలియకపోవడంతో అక్కడే ఉన్న ఓ గుర్తు తెలి యని వ్యక్తికి తన ఏటీఎం కార్డు ఇచ్చి డబ్బులు డ్రా చేయాలని కోరాడు. అతడికి తన పిన్‌ నంబర్‌ చెప్పాడు. అయితే ఏటీఎం కార్డు పని చే యడం లేదని దుండగుడు.. కిషన్‌రావును న మ్మించాడు. అనంతరం మరో ఏటీఎం కార్డు ఇవ్వగా కిషన్‌రావు అక్కడి నుంచి వెళ్లి పోయా డు. తన ఏటీఎం కార్డు పని చేయడం లేదని బ్యాంకు సిబ్బందికి తెలిపి తన వద్ద ఉన్న ఏటీఎం కార్డును చూపాడు. ఆ కార్డును చూసిన సి బ్బంది కిషన్‌రావుకు చెందిన కాదని, డుప్లికేట్‌గా గుర్తించారు. వెంటనే కిషన్‌రావు ఖాతాను పరిశీలించగా అప్పటికే ఏటీఎం కార్డు ద్వారా రూ.40 వేలు వేరే ఏటీఎం దగ్గర నుంచి డ్రా చే సినట్లు గుర్తించారు. ఈ విషయం కిషన్‌రావుకు తెలపడంతో లబోదిబోమన్నాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సీసీ ఫుటేజీని పరిశీలించి విచారణ చేపట్టారు.

ఏటీఎం కార్డు మార్చి ఇచ్చిన దుండగుడు

అనంతరం మరో ఏటీఎంలో డబ్బులు డ్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement