బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..

Apr 23 2025 8:11 AM | Updated on Apr 23 2025 9:07 AM

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..

ఒకరి దుర్మరణం ఉప్పల్‌లో ఘటన

కమలాపూర్‌: రాంగ్‌ రూట్లో వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ ద్విచక్రవాహనదారుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంగళవారం హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కమలాపూర్‌ మండలం రాములపల్లి (కన్నూరు)కు చెందిన వంటకాల రాంరెడ్డి (52) ద్విచక్రవాహనంపై ఉప్పల్‌లోని ప్రభుత్వాస్పత్రికి వస్తున్నాడు. బస్టాండ్‌ వద్ద యూటర్న్‌ తీసుకుని వెళ్తున్న క్రమంలో ఉప్పల్‌కు రాంగ్‌ రూట్లో వస్తున్న ఆర్టీసీ బస్సు.. ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంతో సహా రాంరెడ్డి బస్సు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న సీఐ హరికృష్ణ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతుడి కుమారుడు ప్రణయ్‌ ఫిర్యాదు మేరకు రేగొండ మండలానికి చెందిన బస్సు డ్రైవర్‌ మంతెన శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ హరికృష్ణ తెలిపారు. కాగా, ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని, ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌ పరారైనట్లు స్థానికులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement