రైతులందరికీ యూరియా అందిస్తాం | - | Sakshi
Sakshi News home page

రైతులందరికీ యూరియా అందిస్తాం

Jan 1 2026 1:52 PM | Updated on Jan 1 2026 1:52 PM

రైతులందరికీ యూరియా అందిస్తాం

రైతులందరికీ యూరియా అందిస్తాం

దంతాలపల్లి: రైతులందరికీ యూరియా అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని తొర్రూరు ఆర్డీఓ గణేశ్‌ అన్నారు. మండల కేంద్రంలోని యూరియా పంపిణీ కేంద్రాలను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలో ఎంత యూరియా నిల్వ ఉంది.. రైతులకు ఏ మేరకు అందుతుందనే విషయాలపై ఆరా తీశారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ.. యూరియా విషయంలో రైతులను ఎవరు ఇబ్బంది పెట్టినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సునీల్‌కుమార్‌, ఏఓ వాహిని, తదితరులు ఉన్నారు.

యూరియా పంపిణీని పరిశీలించిన ఏడీఏ

బయ్యారం: మండల కేంద్రంలోని రైతువేదికలో యూరియా పంపిణీని బుధవారం ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులందరికీ యూరియా అందిస్తామని, ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నాగరాజు, ఎంపీడీఓ దీపిక, ఏఓ రాజు, ఎస్సై తిరుపతి, ఇల్లెందు ఏఎంసీ వైస్‌చైర్మన్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement