రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Apr 22 2025 1:15 AM | Updated on Apr 22 2025 1:15 AM

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కురవి: రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని డోర్నకల్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ జాటోత్‌ రాంచంద్రునాయక్‌ అన్నారు. కురవి, సీరోలు మండలాల్లోని కందికొండ, చింతపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో మహబూబాబాద్‌ మార్కెట్‌ చైర్మన్‌ ఇస్లావత్‌ సుధాకర్‌, రెండు మండలాల పార్టీ అధ్యక్షులు కొండపల్లి కరుణాకర్‌రెడ్డి, అంబటి వీరభద్రంగౌడ్‌, బండి శ్రీనివాస్‌, జెరిపోతుల మహేష్‌గౌడ్‌, దువ్వ సైదులు, చందూలాల్‌, సతీష్‌ పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధికి కృషి

మరిపెడ రూరల్‌: మండలంలోని తానంచర్ల శివారు పాలేరు వాగు ఒడ్డును స్వయంభూగా వెలసిన గంగాభవాని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్‌ అన్నారు. జాతరకు ఎమ్మెల్యే హాజరై ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సమాచార హక్కు మాజీ కమిషనర్‌ గుగులోతు శంకర్‌నాయక్‌, నాయకులు యుగేందర్‌రెడ్డి, పురుషోత్తమరెడ్డి, తాజుద్దీన్‌, ఐలమల్లు, కోట వెంకట్‌రెడ్డి, గుగులోతు రవి, పాశం నరేష్‌రెడ్డి, మచ్చ వెంకటనర్సు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే డాక్టర్‌ రాంచంద్రునాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement