
అండర్–7 చెస్ విజేత దేవాన్ష్రెడ్డి
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని ఎస్ఎంఆర్ హైస్కూల్లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–7 చదరంగ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఉమ్మడి జిల్లా నుంచి 14 మంది బాలబాలికలు పాల్గొన్న ఈ పోటీల్లో బైరి దేవాన్ష్రెడ్డి విజేతగా నిలిచినట్లు నిర్వహణ కార్యదర్శి పి. కన్నా తెలిపారు. ద్వితీయ స్థానంలో అక్షాంత్ చౌహాన్, తృతీయ స్థానంలో వింజమూరి వీయాన్స్, వేనం హితాన్స్, బాలికల విభాగంలో మనీషాగాయత్రి, రన్వికతేజ, ఎం. నిత్య, చైత్రపూర్ణిమ వరుస నాలుగు స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. విజేతలు మే 10, 11 తేదీల్లో హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటా రని తెలిపారు. ఈ ముగింపు వేడుకలకు ఎస్ఎంఆ ర్ స్కూల్ కరస్పాండెంట్ వెలగందుల విముక్తీశ్వర్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్బిటర్లు ప్రేమ్సాగర్, బైరి రఘువీరారెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.