పాములపాడు: మండలంలోని ఇస్కాల గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లీలావతి (30 భర్త మధు మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతున్నాడు. పలుమార్లు భార్య వారించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ విషయంలో రెండురోజుల క్రితం ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన లీలావతి ఈనెల 18న గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబీకులు ఆత్మకూరులో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా అక్కడ కోలుకోలేక బుధవారం మృతి చెందింది. మృతురాలి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రమణ తెలిపారు.


