శ్రీమఠం.. భక్త జనసంద్రం
మధ్వ కారిడార్లో భక్తుల సందడి
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయం గురువారం భక్తులతో కిక్కిరిసింది. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించారు. గ్రామ దేవత మంచాలమ్మకు ఉదయాన్నే అభిషేకం, కుంకుమ ఆర్చన, నైవేద్యం సమర్పించి మహామంగళ హారతి చేశారు. శ్రీరాఘవేంద్ర మూల బృందావనానికి నిత్య పూజలు చేశారు. కల్పతరు క్యూలైన్ , శ్రీ మఠం మధ్వ కారిడార్లో భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల మధ్య బంగారు పల్లకీలో ప్రహ్లాదరాయలు విహరించారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా శ్రీ మఠం అధికారులు ఏర్పాట్లు చేశారు.
నిలిచిపోయిన వాహనాలు..
మంత్రాలయంలో మాధవరం రోడ్డు, నాగలదిన్నె రోడ్డు, ఎమ్మిగనూరు రోడ్డులలో వాహనాలు నిలిచి పోయాయి. రాయచూరు నుంచి కర్నూలుకు వెళ్తున్న అంబులెన్స్కు కొద్దిపాటి ఇబ్బంది కలిగింది. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు తన కారులో మాధవరం రోడ్డు వైపులో ట్రాఫిక్ను తనిఖీ చేశారు. రాకపోకలు సాఫీగా సాగేలా సీఐ రామాంజులు, మంత్రాలయం ఎస్ఐ మల్లికార్జున, కోసిగి ఎస్ఐ రమేష్రెడ్డి చర్యలు తీసుకున్నారు.
శ్రీమఠం.. భక్త జనసంద్రం


