వైఎస్సార్‌ సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు

Aug 10 2026 1:58 AM | Updated on Aug 10 2026 1:58 AM

వైఎస్సార్‌ సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు

పటమట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో జరిగిన అవతకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్‌ సీపీ తలపెట్టిన నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఆదివారం వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు, విజయవాడ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌కు పోలీస్‌ కమిషనరేట్‌ సెంట్రల్‌ జోన్‌ పరిధిలోని మాచవరం పోలీసులు నోటీసులు ఇచ్చారు. నారా లోకేష్‌ రాజీనామా కోరుతూ వైఎస్సార్‌ సీపీ పిలుపు మేరకు నిర్వహించే ర్యాలీకి అనుమతి లేదంటూ నోటీసులు అందించారు. విజయవాడలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని, అనుమతి లేకుండా నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement