అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి

Jul 7 2026 1:49 AM | Updated on Jul 7 2026 1:49 AM

● కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామంలో 11, 12వ వార్డుల్లో నివసిస్తున్న 150 మత్స్యకార కుటుంబాలు రాత్రి వేళ చేపల వేటకు వెళ్లే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కొప్పునాతి జగన్నాథం ఇంటి నుంచి లింగన్నకోడు వంతెన వరకు సుమారు 500మీటర్ల మేర వీధి దీపాలు లేకపోవటంతో చీకట్లో ప్రమాదాలకు గురవుతున్నామని నడకుదుటి ఆంజనేయులు తదితరులు అర్జీ ఇచ్చారు. ● ఘంటసాల మండలం చాట్రవానిగూడెంకు చెందిన కుంపటి వరలక్ష్మి తన భర్త మరణానంతరం ఆయన రాసిన వీలునామా ప్రకారం ఆస్తి పంపకాలు జరగటం లేదని ముఖ్యంగా తన ఐదుగురు కుమారుల్లో 3, 5వ కుమారులు సహకరించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని, అంతేకాకుండా ఘర్షణలు చోటు చేసుకుంటున్నందున తనకు ప్రాణహాని ఉందని, వీలునామా ప్రకారం ఆస్తి పంపకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అర్జీ ఇచ్చారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వాన్ని సహించం ‘మీ కోసం’లో జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌ ప్రజల నుంచి 156 అర్జీలు స్వీకరణ

చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం. నవీన్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక(మీ కోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీతో పాటు ఇన్‌చార్జ్‌ డీఆర్వో పోతురాజు, మెప్మా పీడీ సాయిబాబు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ నీలకంఠేశ్వరరెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

ఫోన్లు మాట్లాడితే ఎలా?

ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీలు తీసుకునే సమయంలో ఆ సమస్యను బట్టి సంబంధిత అధికారిని పిలిచి మాట్లాడుతామని అన్నారు. అటువంటి సమయంలో అధికారులు బాధ్యతారాహిత్యంగా ఫోన్లు మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. మీకోసంలో వచ్చిన అర్జీల పరిష్కారంలో జాప్యం చేస్తే సహించేది లేదన్నారు. ప్రతిశాఖ అధికారి వారానికోసారి సమీక్ష నిర్వహించి పెండింగ్‌ అర్జీలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శని, ఆదివారాల్లో సంబంధిత అధికారులు పీజీఆర్‌ఎస్‌ పోర్టల్‌లో ఉన్న దరఖాస్తులను తప్పనిసరిగా పరిశీలించి వెంటనే పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఆర్‌అండ్‌బీ, సర్వే శాఖల్లో పెండింగ్‌ కేసులు ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో అధికారులు 156 అర్జీలను స్వీకరించారు.

వచ్చిన అర్జీల్లో కొన్ని..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement