మచిలీపట్నంఅర్బన్: హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 29న నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నెల 15 నుంచి ఆగస్టు 26వ తేదీ వరకు అమరావతి చాంపియన్షిప్–2026 పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనునున్నట్లు తెలిపారు. అండర్–17, అండర్–23 విభాగాలకు చెందిన వారు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి పొతురాజు, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ సాయిబాబా, కేఆర్సీసీ డెప్యూటీ కలెక్టర్ నీలకంఠేశ్వర రెడ్డి, మచిలీపట్నం డీఎస్పీ శ్రీనివాస్, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి కె. ఝాన్సీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


