అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం

Dec 30 2025 6:59 AM | Updated on Dec 30 2025 6:59 AM

అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం

అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం

● కలెక్టర్‌ బాలాజీ ● మీ కోసంలో 152 అర్జీలు స్వీకరణ ● ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించి బలోపేతం చేయాలని, పనిదినాలు 100 నుంచి 200 రోజులకు పెంచాలని, కనీస వేతనం రూ. 700 కంటే తక్కువ కాకుండా చూడాలని, వేతనాలు రోజు వారీ లేదా వారాంతపు చెల్లింపులతో ఆలస్యం లేకుండా కూలీలకు అందించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి పవన్‌కుమార్‌, సహాయ కార్యదర్శి ఎ వెంకటేశ్వరరావు అర్జీ ఇచ్చారు. ● 2023లో తాను వ్యాపారం నిమిత్తం విజయవాడకు మోటారు సైకిల్‌పై వెళుతుండగా గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో లారీ ఢీకొనడంతో ఎడమ కాలు పూర్తిగా పోయిందని.. తాను మొబైల్‌ దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నానని, ఇబ్బందులు పడుతుండటంతో వికలాంగుల పింఛన్‌ మంజూరు చేయాలని కోరుతూ గన్నవరం మండలం కేసరపల్లి గ్రామానికి చెందిన పండుబాబు అర్జీ ఇచ్చారు.

చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్‌ బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశం హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీ ఎం.నవీన్‌, డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ శ్రీదేవి, డీఎస్పీ శ్రీనివాసరావు అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టిసారించి పరిష్కరించాలన్నారు. కొత్త ఏడాదికి పూలబొకేలు, స్వీట్లు కాకుండా కృష్ణసంకల్పం పేరుతో విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు అందించాలన్నారు. డిసెంబరు 31న పింఛన్ల పంపిణీ చేపట్టాలన్నారు. మీకోసం కార్యక్రమంలో అధికారులు 152 అర్జీలను స్వీకరించారు.

అర్జీల్లో కొన్ని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement