బరి తెగింపు! | - | Sakshi
Sakshi News home page

బరి తెగింపు!

Dec 30 2025 6:59 AM | Updated on Dec 30 2025 6:59 AM

బరి త

బరి తెగింపు!

● సెంట్రల్‌ నియోజకవర్గ ప్రజాప్రతినిధి నున్న సమీపంలో వికాస్‌ కాలేజీ రోడ్డులో హైటెక్‌ బరికి ఏర్పాటు చేస్తున్నారు. దీనికి రూ.2కోట్లు ఒప్పందం చేసుకున్నట్లు చర్చ సాగుతోంది. క్యాసినో స్పెషలిస్టులను రప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంబాపురం, పాములకాలువ వద్ద బరులు ఏర్పాటుకానున్నాయి. ● జగ్గయ్యపేట మండలంలోని షేర్‌ మహ్మద్‌పేట, తొర్రకుంటపాలెం, చిల్లకల్లు, అనుమంచిపల్లి, వేదాద్రి, బుదవాడ, పెనుగంచిప్రోలు మండల పరిధిలో పెనుగంచిప్రోలు, అనిగిండ్లపాడు, వత్సవాయి మండల పరిధిలోని చిట్యాల, లింగాల, వత్సవాయి, దేచిపాలెం, ఇందుగపల్లి గ్రామాలలో కోడి పందేల బరులు ఏర్పాటు చేస్తున్నారు. షేర్‌ మహ్మద్‌పేటలోని 65వ నంబరు జాతీయ రహదారి పక్కన స్థలాన్ని చదును చేశారు. ● ‘మైలవరం’.. రెడ్డిగూడెం మండల పరిధిలో రెడ్డిగూడెం, రంగాపురం, మైలవరం మండల పరిధిలో మొర్సుమల్లి, పొందుగల, వెల్వడం, చంద్రగూడెం, గణపవరం, కీర్తిరాయినిగూడెం, మైలవరం, జి.కొండూరు మండల పరిధిలో కోడూరు, వెల్లటూరు, కందులపాడు, కవులూరు, చెర్వుమాధవరం, మునగపాడు, గంగినేని, కట్టుబడిపాలెం, కుంటముక్కల... ఇబ్రహీంపట్నం మండల పరిధిలో జూపూడి చిన్నలంక, మూలపాడు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, తుమ్మలపాలెం, చిలుకూరు... విజయవాడరూరల్‌ మండల పరిధిలోని కొత్తూరు తాడేపల్లిలో బరుల ఏర్పాటుకు అధికార టీడీపీ నాయకులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా రంగాపురం, జి.కొండూరు, కొత్తూరు తాడేపల్లి బరులు దక్కించుకొనేందుకు పలువురు పోటీపడుతున్నారు. ● ‘తిరువూరు పరిధిలోని మల్లేల, కాకర్ల, తిరువూరు, గంపలగూడెం మండల పరిధిలోని పెనుగొలను, ఊటుకూరు, కనుమూరు, విసన్నపేట మండల పరిధిలోని విసన్నపేట, కొండపర్వ, పుట్రేల, ఏ.కొండూరు మండల పరిధిలోని చీమలపాడు, గొల్లమందల రేపూడిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మల్లేల, కాకర్ల, ఊటుకూరు బరులకు భారీ ధర పలుకుతోంది. ●‘నందిగామ’లోని కంచకచర్ల మండల పరిధిలో గండేపల్లి, వేములపల్లి, నక్కలంపేట.. చందర్లపాడు మండల పరిధిలో కొడవటికల్లు, నందిగామ మండల పరిధిలోని మాగల్లులో బరులను ఏర్పాటు చేసేందుకు అధికార టీడీపీ నాయకులు సిద్ధమవుతున్నారు.

సంక్రాంతికి ముందే జోరుగా కోడి పందేలు, పేకాట

ఉమ్మడి కృష్ణా జిల్లాలో బరులు సిద్ధం

నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు భారీగా ముడుపులు!

రూ.30 లక్షల నుంచి రూ. 2 కోట్లు పలుకుతున్న వైనం

పట్టించుకోని పోలీసులు

సంప్రదాయం ముసుగులో..

240 కోడి కత్తులు పట్టివేత

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో పందెంరాయుళ్లు కాలు దువ్వుతున్నారు. సంక్రాంతికి ముందే కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో పలుచోట్ల మామిడితోటల్లో కోడిపందేలు, పేకాట శిబిరాలు జరుగుతున్నాయి. నియోజకవర్గ, పార్లమెంటు ప్రజాప్రతినిధులు పచ్చ జెండా ఊపడంతో నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. పోలీసులకు సైతం మామూళ్లు అందుతుండటంతో వారు వీటిపై కన్నెత్తి చూడటం లేదని తెలుస్తోంది.

‘క్యాసినో’ నిపుణులు రంగంలోకి..

ఈ ఏడాది ప్రత్యేకంగా ఇప్పటికే క్యాసినో నిపుణులను నిర్వాహకులు రంగంలోకి దించుతున్నారు. నార్త్‌, గోవా, నేపాల్‌ డీలర్లతో సంప్రదింపులు జరిపినట్లు జోరుగా చర్చ సాగుతోంది. రాత్రీపగలు క్యాసినోకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో..

సంక్రాంతి వేళ సంప్రదాయం ముసుగులో కోట్లు దండుకునేందుకు అధికార టీడీపీ రెడీ అయ్యింది. పండుగ వేళ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బరుల స్థాయిని బట్టి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు రేటు ఫిక్స్‌ చేశారు. వీటి నిర్వహణను పెద్ద ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలకు కొందరు ప్రజాప్రతినిధులు అప్పజెప్పారు. పండుగకు వారం ముందు నుంచే ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహిస్తూ సంప్రదాయం ముసుగు కప్పి బరులను సిద్ధం చేసేందుకు ప్రణాళిక రెడీ చేశారు.

గుడ్లవల్లేరు: మండల కేంద్రంలో భారీగా కోడి కత్తులను పోలీసులు పట్టుకున్నారు. దీనిపై ఎస్‌.ఐ సత్యనారాయణ మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారంతో గుడ్లవల్లేరు మార్కెట్‌ యార్డ్‌ వద్ద కోడి కత్తులు కలిగి ఉన్నట్లు తెలిసి సిబ్బందితో కలిసి కుంభా రామకృష్ణ అనే దివ్యాంగుడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. 240 కోడి కత్తులు స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. అతనిపై గుడ్లవల్లేరు పీఎస్‌లో కేసు నమోదు చేశామన్నారు.

బరి తెగింపు! 1
1/3

బరి తెగింపు!

బరి తెగింపు! 2
2/3

బరి తెగింపు!

బరి తెగింపు! 3
3/3

బరి తెగింపు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement