వధూవరులుగా దుర్గామల్లేశ్వరులు | - | Sakshi
Sakshi News home page

వధూవరులుగా దుర్గామల్లేశ్వరులు

Apr 9 2025 2:15 AM | Updated on Apr 9 2025 2:15 AM

వధూవరులుగా దుర్గామల్లేశ్వరులు

వధూవరులుగా దుర్గామల్లేశ్వరులు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీగంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు మల్లేశ్వర ఆలయ ప్రాంగణంలో పంచామృత అభిషేకాలు, మంగళస్నానాలు నిర్వహించారు. అనంతరం పూజలు నిర్వహించి, పెళ్లికుమారుడు, పెళ్లి కుమార్తెగా అలంకరించారు. సాయంత్రం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, అఖండ దీప స్థాపన, కలశారాధన, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణం వంటి వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు జరిపించారు. సాయంత్రం ఉత్సవమూర్తు లను వెండి పల్లకీపై ఉంచి నగరోత్సవ సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగ ణంలోని మల్లేశ్వర మహా మండపం నుంచి వెండి పల్లకీ సేవ ప్రారంభమగా, మేళతాళాలు, కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలు, భజన బృంద సభ్యులతో ఊరేగింపు కనుల పండువగా సాగింది. నగరోత్సవం కనకదుర్గనగర్‌, రథం సెంటర్‌, బ్రాహ్మణ వీధి, కొత్తపేట, సామారంగం చౌక్‌ మీదగా తిరిగి ఆలయానికి చేరుకుంది. ఆలయ స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, ఉప ప్రధాన అర్చకుడు కోట ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement