దిశ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు | - | Sakshi
Sakshi News home page

దిశ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు

Jan 11 2024 7:36 AM | Updated on Jan 11 2024 11:34 AM

- - Sakshi

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): భార్యను వేధిస్తున్న ఓ కానిస్టేబుల్‌పై చిలకలపూడి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. అతడిని సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ పి.జాషువా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల కథనం మేరకు.. దిశ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కోలా రవికిరణ్‌ 2018లో జరిగిన ఎలక్షన్‌ బందోబస్తు నిమిత్తం మండవల్లి వెళ్లాడు. అక్కడ వీఆర్‌ఏగా పనిచేస్తున్న పూజితవిమలాదేవితో అతడికి పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అప్పటికే వివాహం చేసుకున్న విమలాదేవి భర్తకు ఈ విషయం తెలిసి ఆమెకు విడాకులు ఇచ్చేశాడు.

దీంతో 2020లో విమలాదేవిని రవికిరణ్‌ వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజుల పాటు భార్యతో ప్రేమగా ఉన్న రవికిరణ్‌ ఆ తరువాత ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించటం మొదలుపెట్టాడు. వేధింపులు తట్టుకోలేని భార్య రవికిరణ్‌పై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దిశ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తూ మహిళలకు రక్షణగా నిలవాల్సిన కానిస్టేబుల్‌ భార్యను వేధిస్తున్నాడని తెలుసుకున్న ఎస్పీ పి.జాషువా అతడిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement