సమ్మె సమయంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సమగ్ర శిక్షను పూర్తి స్థాయిలో విద్యాశాఖలో విలీనం చేసి ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలి. పేస్కేల్ అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం ప్రకటించాలి. ఉద్యోగులకు అప్పటి పీసీసీ హోదాలో ఇచ్చిన హామీని ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి అమలు చేయాలి. సమ్మెకాలపు వేతనాలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి.
– సంతోష్, సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ అధికార ప్రతినిధి


