ఆసిఫాబాద్రూరల్: పుస్తక పఠనంతో విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు, పదజాలం, ఆలోచన శక్తి, సృజనాత్మక మెరుగుపడుతుందని డీఈవో సచ్చిదానంద చారి అన్నారు. ‘నా మాటలు– నా కథ పఠనోత్సవం’లో భాగంగా మంగళవారం మండలంలోని తుంపెల్లి పాఠశాలలో రీడ్ ఏ థాన్ కార్యక్రమం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచే పిల్లల్లో పఠన సంస్కృతిని పెంపొందించాలన్నారు. డ్రాప్ ఎవ్రీథింగ్ అండ్ రీడ్ ఏ బుక్ అనే కాన్సెప్ట్తో ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటల వరకు కథల పుస్తకాలు, ఇతర పఠన సామగ్రిని చదవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్వో శ్రీనివాస్, హెచ్ఎం నాగేశ్వర్ పాల్గొన్నారు.
విద్యార్థినితో చదివిస్తున్న డీఈవో సచ్చిదానంద చారి


