
ఆయుష్షు పోస్తూ..
ఆయువు పోయినా..
సుజాతనగర్: అమ్మ జన్మనిస్తే అవయవదానం పునర్జన్మనిస్తుంది.. మరణించినా కళ్లు మాత్రం ఈ లోకాన్ని చూస్తూనే ఉంటాయి. ఏ లోకంలో ఉన్నా మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేస్తూనే ఉంటాయి. మశ్వాస ఆగిపోయినా గుండె మాత్రం లబ్ డబ్ అని కొట్టుకుంటూనే ఉంటుంది.. ‘ఆయువు పోయినా.. అవయదానంతో ఊపిరిపోద్దాం.. అవయవాలను ఈ లోకంలో జీవించనిద్దాం.. రండి అవయదానం చేద్దాం.. మరణించినా మరో వ్యక్తిలో జీవించే ఉందాం’.. అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా కొందరు అపోహలు, అనుమానాలతో వెనకడుగు వేస్తున్నారు. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం అవయవదానంపై అవగాహన పెరుగుతోంది. ఈ విషయమై విస్తృత అవగాహన కోసం ఏటా ఆగస్టు 13న ‘ప్రపంచ అవయవదాన దినోత్సవం’ నిర్వహిస్తున్నారు.
●పెరికసింగారం.. నవీన్
కూసుమంచి మండలం పెరికసింగారం గ్రామానికి చెందిన బత్తుల నవీన్ ఓ కంపెనీలో సేల్స్ బాయ్గా పనిచేసేవాడు. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయనను హైదరాబాద్కు తరలించి చికిత్స చేయిస్తుండగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. వైద్యులు అవగాహన కల్పించగా, ఆయన కుటుంబీకులు అవయవాలను దానం చేశారు.
అవయవదానానికి ముందుకొస్తున్న కుటుంబాలు
ఉమ్మడి జిల్లాలో పెరిగిన అవగాహన
నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం

ఆయుష్షు పోస్తూ..