సీపీఎం సీనియర్‌ నేత మధుసూదన్‌రావు మృతి | - | Sakshi
Sakshi News home page

సీపీఎం సీనియర్‌ నేత మధుసూదన్‌రావు మృతి

Apr 28 2025 1:13 AM | Updated on Apr 28 2025 1:13 AM

సీపీఎ

సీపీఎం సీనియర్‌ నేత మధుసూదన్‌రావు మృతి

కొణిజర్ల: మండలంలోని లాలాపురం గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్‌ నేత సంక్రాంతి మధుసూదన్‌రావు (83) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. కొద్దిరోజుల కిందట అనారోగ్యానికి గురవగా ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు. ఆయనకు భార్య సామ్రాజ్యం, కుమారుడు రవి, కూతురు సంధ్య ఉన్నారు. మధుసూదన్‌రావు మృతదేహాన్ని నాగర్‌కర్నూలు ఎంపీ, కాంగ్రెస్‌ జాతీయ నాయకులు మల్లు రవి, గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌నాయక్‌, సీపీఎం జాతీయ సమితి సభ్యుడు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు సందర్శించి, మృతదేహంపై ఎర్రాజెండా కప్పి నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మధు విద్యా సంస్థల కార్యదర్శి మల్లెంపాటి వీరభద్రం, నాయకులు భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, బొర్రా రాజశేఖర్‌, తాళ్లపల్లి కృష్ణ, కొప్పుల కృష్ణయ్య కూడా నివాళులర్పించారు. కాగా, మధుసూదన్‌రావు నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. గ్రామస్తులు, పలు పార్టీల నాయకుల సందర్శన అనంతరం సాయంత్రం అంతిమయాత్ర నిర్వహించి, మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించారు.

నివాళులర్పించిన పలు పార్టీల నాయకులు

సీపీఎం సీనియర్‌ నేత మధుసూదన్‌రావు మృతి 1
1/1

సీపీఎం సీనియర్‌ నేత మధుసూదన్‌రావు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement