
లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య
సత్తుపల్లిటౌన్: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి లాడ్జిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం సత్తుపల్లిలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా పెనగంచిప్రోలుకు చెందిన తన్నీరు రవికుమార్ (34) తిరునాళ్లలో చేతులపై టాటూలు వేస్తూ.. కీ చైన్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపం చెంది సత్తుపల్లిలోని వేంసూర్ రోడ్లోగల ఓ లాడ్జిలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బైక్ అదుపుతప్పి
యువకుడు దుర్మరణం
రఘునాథపల్లి: వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారిలోని కోమళ్ల టోల్ ప్లాజా సమీపంలో బైక్ అదుపుతప్పి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లి గ్రామానికి చెందిన గుంజులూరి ఉదయ్ (24) వరంగల్ నుంచి హైదరాబాద్కు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. కోమళ్ల టోల్ ప్లాజా సమీపంలో ముందువెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న రెయిలింగ్ను ఢీకొట్టి.. అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి.నరేశ్ తెలిపారు.