హోసూరు: హోసూరు పారిశ్రామిక వాడలో తమిళనాడు ప్రభుత్వం నిషేధించిన గుట్కా ఉత్పత్తులను విక్రయిస్తున్న చిల్లర దుకాణాన్ని అధికారులు సీజ్ చేశారు. హోసూరు కార్పొరేషన్ పరిధిలో నిషేధిత గుట్కా ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయని ఆహారభద్రత శాఖ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఆహారభద్రత శాఖ అధికారులు రవి, ప్రభాకరన్, శాంఇళంగో, హరి తదితరుల బృందం గురువారం సాయంత్రం పారిశ్రామికవాడ జూజువాడి, బేడరపల్లి ప్రాంతాల్లో ఆకస్మిక దాడి చేశారు. బేడరపల్లి ఎంజీఆర్ నగర్ ప్రాంతంలో రీఠారాయ్ నిర్వహిస్తున్న చిల్లర దుకాణంలో 40 కిలోల గుట్కా పట్టుబడింది. గుట్కాను స్వాధీనం చేసుకుని దుకాణాన్ని సీజ్ చేసి, రూ.25 వేల జరిమానా విధించారు.


