బనశంకరి: జ్యోతిష్యుడు ద్వారకనాథ్ సుబ్రమణ్య దేవస్థానం నిర్మించడానికి సమయం వచ్చిందని, ఆయన తనకు పూజ్యగురువు అని సీఎం డీకే. శివకుమార్ అన్నారు. ఆదివారం యశవంతపుర లోని బనశంకరి ఆరోస్టేజ్ లింగదీరనహళ్లిలో శ్రీషణ్ముఖ సుబ్రమణ్య ఆలయం నిర్మాణానికి సీఎం భూమిపూజ చేశారు. ఆలయం అంటే భక్తి, శక్తి, సంస్కారం, భక్తులు ప్రశాంతత కోసం విచ్చేస్తారని తెలిపారు. పూజ ఏదైనా భక్తి ఒక్కటే, కర్మ ఏదైనా నిష్ట ఒక్కటే అన్నారు. దేవుడు వివిధ రూపాల్లో ఉంటాడన్నారు. రాయి. గోడ, మనుషులు, అలాగే పశువుల్లో కూడా దైవ స్వరూపం ఉంటుందన్నారు.


