
వడగండ్ల బీభత్సం.. పంటలకు నష్టం
రాయచూరు రూరల్: అకాల వర్షాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ఈదురు గాలులు, వడగండ్ల వర్షంతో వేల ఎకరాల్లో పంటలకు భారీగా నష్టం జరిగింది. రాయచూరు, యాదగిరి, కలబురిగి జిల్లాలో శనివారం సాయంత్రం ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. దీంతో రాయచూరు జిల్లా యరగేర, గుంజళ్లి, ఇడపనూరు, దేవదుర్గ తాలుకా గలగ, మస్కి మెదికనాళ, మాన్వి తాలూకాలోని కవితాళ, లింగ సూగురు తాలుకా గురుగుంట, హట్టి, పామన కల్లూరు, యదగిరి జిల్లాలోని వడగేర, శహపుర, కలబుర్గి జిల్లాలోని కమలాపురలో పంటలకు నష్టం జరిగింది. వరి పంట నేలకొరిగింది. మామిడి కాయలు రాలిపోయాయి. మిరప పంటలు నీటిలో తేలియాడాయి. పత్తి పంట దెబ్బతింది. యరగేరలో 150 మామిడి చెట్లు, శహపురలో వెయ్యి ఎకరాలలో మిరప పంట, 2500 ఏకరాలలో వరి పైరు నాశనమైంది. వడ గేరలో లక్ష్మణ్ అనే రైతుకు చెందిన 25 ఏకరాల్లోని వరి పంటను వడగళ్లు కప్పేశాయి. పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు నీటిపాలు కావడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాగా బీదర్లో భారీ వర్షాలకు 8 వేల కోళ్లు మృతి చెందాయి. రాయచూరులోని ఆర్టీఓ సర్కిల్ వర్షం నీరు పోటెత్తి వాహనరాకపోకలకు అంతరాయం కలిగింది.
నేలకొరిగిన వరిపంట
నీట మునిగిన మిరప, పత్తి పంటలు
నేలపాలైన మామిడి కాయలు

వడగండ్ల బీభత్సం.. పంటలకు నష్టం

వడగండ్ల బీభత్సం.. పంటలకు నష్టం

వడగండ్ల బీభత్సం.. పంటలకు నష్టం