విద్యార్థినిపై సామూహిక అత్యాచారం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Oct 15 2023 12:54 AM | Updated on Oct 15 2023 8:07 AM

- - Sakshi

సాక్షి బళ్లారి: నగరంలోని ఓ కళాశాలలో బీకాం చదువుతున్న విద్యార్థినిని సినీఫక్కీలో కిడ్నాప్‌ చేసి సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈనెల 11న నలుగురు యువకులు కళాశాల వద్దకు వచ్చి మీ అన్న పిలుస్తున్నాడని చెప్పి సదరు విద్యార్థిని ఆటోలో కిడ్నాప్‌ చేసుకుని కొప్పళ జిల్లా సనాపురం పక్కన ఉన్న హోటల్‌కు తీసుకెళ్లి ఆమెకు మద్యం తాపించి అత్యాచారం చేశారు.

ఈ ఘటనపై కౌల్‌బజార్‌ నవీన్‌, షాకిబ్‌, థనుతో పాటు మరొకరిపై మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులు విద్యార్థినికి పరిచయం ఉన్నవారు కావడంతోనే ఆమె కళాశాల బయటకు వచ్చిన వెంటనే ఆటోలో కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో నవీన్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement