న్యూస్రీల్
ప్రజల్లో దేశభక్తి, గోసంరక్షణపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో బుధవారం జిల్లాకేంద్రంలో నమో మిషన్ వందే గోమాతరం సంస్థ ఆధ్వర్యంలో గోసమేత తిరంగా ర్యాలీ నిర్వహించారు. తెలంగాణచౌక్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గోమాతకు ప్రత్యేక పూజలు చేసి, సుమారు 200 మీటర్ల పొడవైన జాతీయజెండాతో ర్యాలీని ప్రారంభించారు. గోమాతను జాతీయ మాతగా గుర్తించాలని సుమారు 600 మంది విద్యార్థులు, యువత, నాయకులు నినాదాలు చేస్తూ ర్యాలీ సాగింది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య మద్విరాజ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. – కరీంనగర్
గోమాతను గుర్తించాలి


