ప్లాస్టీక్ నివారణ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామంలో స్వప్న స్వదేశ్ ఫౌండర్ డా.స్వప్నరావు ఆధ్వర్యంలో ఇంటింటికీ కాటన్ బ్యాగులు ఉచితంగా పంపిణీ చేశారు. ఏప్రిల్లో మహిళా సాధికారత కేంద్రం కుట్టుశిక్షణ ప్రారంభించి మూడు బ్యాచ్ల్లో 60 మంది మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చా రు. ప్లాస్టిక్ భూతంతో గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య గుర్తించారు. తన సంస్థలో శిక్షణ పొందిన మహిళల ద్వారానే కాటన్ బ్యాగ్లు తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేసినట్లు స్వప్నరావు తెలిపారు.


