చొప్పదండి: ప్రజా ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండలంలోని రుక్మాపూర్లో స్వశక్తి సంఘాల నూతన భవనాల నిర్మాణానికి గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలను గౌరవించుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేశ్, వడ్లూరి శ్రీనివాస్, పెరుమాండ్ల గంగయ్యగౌడ్, కర్రె ప్రేమలత, నిజానపురం చందు, పురం రాజేశం, తదితరులు పాల్గొన్నారు.


