మల్యాల: ముత్యంపేటలోని కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ ఈవోగా అంజారెడ్డిని నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్చార్జి ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వేములవాడ రాజన్న ఆలయ ఈవో రమాదేవి నుంచి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆలయ సిబ్బంది ఈవో అంజారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
భీమన్న ఆలయంలో పూజలు
వేములవాడఅర్బన్: భీమేశ్వర స్వామివారిని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ఈవో ఎస్.అంజారెడ్డి గురువారం దర్శించుకున్నారు. స్వామివారి మండపంలో లడ్డూ ప్రసాదాన్ని ఆలయ ఈవో రమాదేవి అందజేశారు.


