
నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
కరీంనగర్రూరల్: బొమ్మకల్లోని ట్రినిటి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఎడ్యూనెట్ ఫౌండేషన్ ద్వారా సాప్ కార్యక్రమాన్ని ఎడ్యునెట్ ప్రాజెక్టు మేనేజరు అఫ్సర్ పాషా, ప్రోగ్రాం మేనేజర్ దేవీసేన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ట్రినిటి విద్యాసంస్థల వ్యవస్థాపకులు దాసరి మనోహర్రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎడ్యునెట్ ఫౌండేషన్ ద్వారా అందించే సాప్ కోర్స్ను ఎంబీఏ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులకు గ్లోబల్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ట్రినిటి చైర్మెన్ దాసరి ప్రశాంత్రెడ్డి, ప్రిన్సిపాల్ నాగేంద్రసింగ్, వైస్ ప్రిన్సిపాల్ కిశోర్, ఏవో రాజశేఖర్రెడ్డి, హెచ్వోడీ ప్రవీణ్కుమార్, సంతోషి, రజితరెడ్డి, ఇలియాస్అలీ, అజారుద్దీన్, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మండలం గూడెంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. గూడెంకు చెందిన పిట్ల దేవయ్య(60) సోమవారం ఉదయం ఇంట్లో మృతిచెంది ఉన్నాడు. దేవయ్య ముఖం, శరీరంపై గాయాలు ఉన్నాయి. దేవయ్య మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోదరుడు లస్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు సీఐ మొగిలి, ఎస్సై గణేశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. లస్మయ్య ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్సై తెలిపారు. దేవయ్య ఆయన కుమారుడు చందు తరచూ గొడవ పడేవారని, అర ఎకరం భూమి విషయంలో తండ్రీకొడుకుల మధ్య వివాదం తలెత్తిందని తెలిపారు. ఆ కోణంలో చందును ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు.
జ్వరంతో యువకుడు..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగుండారం గ్రామానికి చెందిన లకావత్ శివ(23) జ్వరంతో బాధపడుతూ సోమవారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరా లు. రాచర్లగుండారం గ్రామానికి చెందిన లకా వత్ జయరాం–సోబి దంపతుల కుమారుడు శివ చిన్నతనం నుంచి మూర్ఛవ్యాధితో బాధపడుతుండే వాడు. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న శివకు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీల వద్ద వైద్యం అందించారు. జ్వరం తగ్గకపోగా.. పరిస్థితి విషమంగా మారడంతో మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.
డిష్ రిపేర్ చేస్తూ.. కింద పడి వ్యక్తి..
సారంగాపూర్: మండలంలోని పెంబట్ల గ్రా మంలో ఓ ఇంటిపై డిష్ రిపేర్ చేస్తూ.. కిందపడి పల్లికొండ మహేశ్ (40) మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై గీత కథనం ప్రకారం.. జగిత్యాలలోని పోచమ్మవాడకు చెందిన మహేశ్ పెంబట్లలోని చొప్పరి రాజేందర్ ఇంట్లో డిష్ రాకపోవడంతో వెర్ను సరిచేసేందుకు ఇంటిపైకి ఎక్కాడు. మహేశ్నిలబడి ఉన్న సజ్జ విరిగి కింద పడిపోయాడు. తల బండరాయిపై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108లో జగిత్యా ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య సంధ్యారాణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ద్విచక్ర వాహనం నుంచి పడిపోయిన బంగారం బ్యాగు
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేట–పొరండ్ల శివారులో ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యాభర్తల వద్దనున్న బంగారం బ్యాగు పడిపోయిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. రాయికల్ మండలం వీరాపూర్కు చెందిన స్వామిరెడ్డి తన భార్యతో కలిసి సోమవారం జగిత్యాల మార్కెట్లో కూరగాయలు కొనుక్కుని వెళ్తుండగా వారి వద్దనున్న బంగారం బ్యాగు హన్మాజీపేట–పొరండ్ల మధ్యలో పడిపోయింది. పొరండ్లకు వెళ్లేసరికి బంగారు బ్యాగుతోపాటు, సెల్ఫోన్ కన్పించకపోవడంతో రోడ్డు వెంట పరిశీలించుకుంటూ వచ్చినా బ్యాగు దొరకలేదు. బాధితులు రూరల్ పోలీస్ష్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలిస్తున్నారు.

నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి