
వేములవాడలో ఆధునిక అన్నదాన సత్రం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు నిరంతరం అన్నదానం అందించేందుకు రూ.35కోట్లతో అన్నదాన సత్రాన్ని అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించనున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శృంగేరి పర్యటనలో ఉన్న అధికా రుల బృందం అక్కడి కొల్లూరు మూకాంబిక అమ్మవారిని సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని నిత్యాన్నదాన సత్రాన్ని పరిశీలించారు. వేములవాడలో అత్యాధునిక పద్ధతుల్లో అన్నదాన సత్రం నిర్మించేందుకు టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. ఆలయ ఈవో కొప్పుల వినోద్రెడ్డి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, అర్చకులు చంద్రగిరి శరత్శర్మ, సురేష్శర్మ, ఏఈ రాంకిషన్రావు తదితరులు ఉన్నారు.
జాతీయపోటీలకు ఎంపిక
కరీంనగర్స్పోర్ట్స్: హైదరాబాద్లో ఫిబ్రవరిలో జ రిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ స్కేటింగ్ పోటీల్లో పా ల్గొన్న జిల్లాకు చెందిన శ్రీహాన్సి రెండు బంగారు పతకాలు సాధించి, ఈనెల 30నుంచి ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి ఎస్జీఎఫ్ పోటీలకు ఎంపికై నట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. శ్రీహన్సిని జిల్లా విద్యాధికారి సీహెచ్ జనార్దన్రావు సోమవారం అభినందించారు. జాతీయ పోటీల్లో రాణించి బంగారు పతకం సాధించాలని సూచించారు. సెక్టోరియల్ అధికారి కర్ర అశోక్రెడ్డి, కోచ్ నరహరి పాల్గొన్నారు.

వేములవాడలో ఆధునిక అన్నదాన సత్రం