బీఆర్ఎస్ డైరీ ఆవిష్కరణ
కామారెడ్డి టౌన్: బీఆర్ఎస్ పార్టీ డైరీలను నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజార్టీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నీరడి శంకర్, నల్లవెల్లి అశోక్, కుంబాల రవి, బల్వంత్రావు, పాత హనుమాన్లు, రాజాగౌడ్, రమేష్, సర్పంచ్ చిందం మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.


