
మెరుగైన వైద్య సేవలందించాలి..
కామారెడ్డి క్రైం : ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగై న వైద్య సేవలందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సిబ్బందికి సూచించారు. కామారెడ్డి మండలం గర్గుల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రా న్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. కేంద్రంలోని మౌలిక వసతులు, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్య కేంద్రం భవనానికి విద్యుత్ సరఫరా, నీటివసతిని క ల్పించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధి కారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రం పరిసరాల్లో రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసు అధికారులను, కేంద్రంలో అవసరమై న ఇతర మౌలిక సదుపాయాలకు తగిన ఏర్పా ట్లు చేయాలని డీఎంహెచ్వో చంద్రశేఖర్ను ఆ దేశించారు. వైద్యాధికారులు ప్రభు దయాకిరణ్, జోహా, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఉన్నారు.