
ఎక్స్గ్రేషియా చెక్కుల అందజేత
ఖలీల్వాడి: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ రాథోడ్ ప్రతాప్ సింగ్ సతీమణికి సోమవారం రూ.16 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కును సీపీ కార్యాలయంలో సీపీ సాయి చైతన్య అందజేశారు. నిజామాబాద్ అదనపు డీసీపీ (ఎఆర్)రామచంద్రరావు, ఏఓ అనిసాబేగం, ఆఫీస్ సూపరింటెండెంట్ వనజ, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షకీల్ పాషా తదితరులు ఉన్నారు.
బీర్కూర్లో యువకుడి ఆత్మహత్య
బాన్సువాడ రూరల్: బీర్కూర్ మండల కేంద్రంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు లా.. మండల కేంద్రానికి చెందిన భూతిపిల్లి మహేష్(35) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి అతడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు బీర్కూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
ఈత చెట్లు దగ్ధం
భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఉన్న ఈత వనం సోమవారం దగ్ధమైంది. గౌడసంఘం ఆధ్వర్యంలో ఆరు ఎకరాల స్థలంలో ఈత చెట్లను పెంచుతున్నారు. సోమవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఈత చెట్లు దగ్ధం అయ్యాయి. వెంటనే స్థానికులు ఫైర్ఇంజన్కు సమాచారం అందించగా, వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే రెండు వేల చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. చెట్ల దగ్ధం ఘటన మందుబాబుల పనే కావచ్చునని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.
తగ్గెల్లి గ్రామంలో..
బోధన్: సాలూర మండలంలోని తగ్గేల్లి గ్రామ శివారులో గల కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం పరిధిలోని ఈత వనంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఐదు ఎకరాల విస్తీరణంలో ఉన్న ఈత వనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి చెట్లు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. నాలుగేళ్లుగా ఆరుగాలం కష్టపడి పెంచిన ఈత చెట్లు కాలిపోవడం వల్ల రూ.15 నుంచి 20 లక్షల వరకు నష్టం వాటిల్లిందని సంఘ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్స్గ్రేషియా చెక్కుల అందజేత

ఎక్స్గ్రేషియా చెక్కుల అందజేత

ఎక్స్గ్రేషియా చెక్కుల అందజేత