రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయాలి

Apr 26 2025 1:31 AM | Updated on Apr 26 2025 1:31 AM

రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయాలి

రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయాలి

కామారెడ్డి క్రైం: మద్దెల చెరువు నుంచి పిట్లం వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ సూచించారు. శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయంలో అటవీ, రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అటవీ ప్రాంతానికి బయట ప్రాంతంలో ఉన్న చెట్ల నరికివేతకు అటవీ శాఖ నుంచి అనుమతి జారీ చేశామన్నారు. వాటికి శాఖాపరమైన పద్ధతిలో పరిహారం చెల్లించి తొలగించాలని రోడ్లు, భవనాల శాఖను ఆదేశించారు. అటవీ ప్రాంతంలోని చెట్లను తొలగించడం కోసం స్టేజీ– 1 అనుమతులకు చర్యలు తీసుకుని పనులు మొదలు పెట్టాలన్నారు. సమావేశంలో ఆర్డీవో వీణ, ఆర్‌అండ్‌బీ ఈఈ రవిశంకర్‌, ఎఫ్‌డీవో రామకృష్ణ, ఎఫ్‌ఆర్‌వో రవి, ఏఈఈ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement