ఉమ్మడి జిల్లా రైతులు తరలిరావాలి | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా రైతులు తరలిరావాలి

Apr 20 2025 1:22 AM | Updated on Apr 20 2025 1:22 AM

ఉమ్మడి జిల్లా రైతులు తరలిరావాలి

ఉమ్మడి జిల్లా రైతులు తరలిరావాలి

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌లోని జీజీ కాలేజీలో సోమవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న రైతు మహోత్సవానికి ఉమ్మడి జిల్లా రైతులు తరలిరావాలని డీసీసీబీ చైర్మన్‌ కుంట రమేశ్‌రెడ్డి కోరారు. నగరంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు, సాంకేతిక విజ్ఞానం ద్వారా లాభసాటి వ్యవసాయం, రైతుకు అధిక దిగుబడి వచ్చే అంశాలు, డ్రోన్‌ వ్యవసాయం, వివిధ రకాల వంగడాలకు సంబంధించిన స్టాళ్లు ఉత్సవాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నా రు. సమావేశంలో బ్యాంకు వైస్‌ చైర్మన్‌ నల్ల చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్లు గిర్దావర్‌ గంగారెడ్డి, గోర్కంటి లింగన్న, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement