బాన్సువాడ తైబజార్‌ వేలం | - | Sakshi
Sakshi News home page

బాన్సువాడ తైబజార్‌ వేలం

Mar 26 2025 1:31 AM | Updated on Mar 26 2025 1:25 AM

బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీ తైబజార్‌కు మంగళవారం వేలం పాట నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి రాజు అధ్వర్యంలో ప్రక్రియ సాగింది. కాంట్రాక్టర్‌ జంషేర్‌ ఖాన్‌ రూ. 46.26 లక్షలకు మేకలు, గొర్రెలు సంతను దక్కించుకున్నారు. గతేడాది ఈ సంత తైబజార్‌ రూ.43.93 లక్షలు పలికింది.

● రోజువారి సంతను లింగాల ప్రీతంరెడ్డి రూ.9.02 లక్షలకు దక్కించుకున్నారు. ఈ సంతకు గతేడాది కూడా ఇదే ధర లభించింది. పశువుల దాఖలను ప్రీతంరెడ్డి రూ. 20 వేలకు దక్కించుకున్నారు. ఈ సంత గతేడాది రూ. 10 వేలే పలకడం గమనార్హం.

● వారసంతను జగన్మోహన్‌రావు రూ. 12.31 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది ఈ సంత రూ. 12.33 లక్షలు పలికింది. తైబజార్‌తోపాటు సంతలను వేలం వేయగా బల్దియాకు గతేడాది కంటే రూ. 2.40 లక్షల ఆదాయం అదనంగా సమకూరిందని బాన్సువాడ మున్సిపాలిటీ మేనేజర్‌ మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement