రూ.2.50 లక్షల విలువైన ఫోన్ల రికవరీ | - | Sakshi
Sakshi News home page

రూ.2.50 లక్షల విలువైన ఫోన్ల రికవరీ

Sep 5 2026 12:20 AM | Updated on Sep 5 2026 12:20 AM

రంపచోడవరం: సబ్‌ డివిజన్‌ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు పోగొట్టుకున్న, చోరీకి గురైన 20 మొబైల్‌ ఫోన్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీఈఐఆర్‌ పోర్టల్‌ సాయంతో పోలీసులు రికవరీ చేశారు. వాటిని శుక్రవారం యజమానులకు అందజేశారు. సుమారు రూ.2.50 లక్షల విలువైన ఆ ఫోన్లను స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితులకు జిల్లా అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అడ్మిన్‌ ఓఎస్‌డీ జవాలి అల్ఫాన్సా, రంపచోడవరం డీఎస్పీ, ఎస్‌డీపీఓ పి.అష్రఫ్‌ అలీ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైబర్‌ నేరాలు, మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సైబర్‌ మోసానికి గురైనట్లయితే వెంటనే 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రంపచోడవరం సీఐ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement