రికార్డు స్థాయిలో భజన సంకీర్తన | - | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో భజన సంకీర్తన

Aug 9 2026 1:46 AM | Updated on Aug 9 2026 1:46 AM

108 రోజుల పాటు నిర్వహణకు ఏర్పాట్లు

864 భజన సమాజాలతో

2592 గంటల పాటు సంకీర్తన

వేదిక కానున్న దుర్గాడ శివాలయం

పిఠాపురం: గొల్లప్రోలు మండలం దుర్గాడలోని ప్రసిద్ధ పంచాయతన సమేత ఉమా రామలింగేశ్వర ఆలయ స్వర్ణోత్సవ, బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు అరుదైన ఘనత సాధించేందకు సిద్ధమయ్యారు. 108 రోజుల పాటు నిర్వరామంగా భజన నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలో స్వామి వారిని ప్రతిష్టించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 23వ తేదీ నుంచి డిసెంబర్‌ 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 864 భజన సమాజాలతో 2592 గంటల పాటు నిర్విరామ భజన నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఇది ప్రపంచ రికార్డు సాధించే అవకాశం ఉండడంతో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. దీనిలో భాగంగా శనివారం ఆలయం ఆవరణలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి పందిరి రాట వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement