
ఐపీఎస్ అధికారిగా సమాజ సేవ చేస్తా
పిఠాపురం: ఐపీఎస్ అధికారిగా సమాజ సేవ చేస్తానని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 94 ర్యాంకర్ చెక్క స్నేహిత్ తెలిపారు. పిఠాపురానికి చెందిన ఈ యువకుడి ఘనతను ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా స్నేహిత్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచి తనకు ఐపీఎస్ అవ్వాలనే కోరిక ఉండేదని, అదే లక్ష్యంగా చదువుకున్నానన్నారు. తన విజయం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. తల్లి మాధురి కుమునిది గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్నారని, తండ్రి వెంకట్ చిన్న వ్యాపారవేత్త అని తెలిపారు. కాగా..స్నేహిత్ ఐదో తరగతి వరకు పిఠాపురంలోని ఆదర్శ విద్యాలయలో చదువుకున్నాడు. ఆరో తరగతి నుండి ఇంటర్ వరకూ గుంటూరులోని భాష్యం విద్యాసంస్థల్లో చదివాడు. ఎంసెట్లో 31వ ర్యాంకు సాధించి, గుజరాత్లో ఎలక్ట్రికల్ ఇంజినీర్గా ఉత్తీర్ణుడయ్యాడు. సివిల్స్లో ఆప్షనల్ సబ్జెక్టుగా మ్యాథ్య్ తీసుకున్నాడు. ఢిల్లీలో కోచింగ్ తీసుకోవడంతో పాటు సొంతంగా చదివి సివిల్స్లో 94 ర్యాంకు సాధించాడు.
చిన్ననాటి నుంచే చదువులో మేటి
కొవ్వూరు: నిడదవోలు విద్యుత్ డివిజన్ పరిధిలో కొవ్వూరు టౌన్ ఏఈ(డీ–1)గా పనిచేస్తున్న దొమ్మేటి జగదీశ్వరరావు కుమారుడు దొమ్మేటి వినయ్ 2024 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీస్లో 274వ ర్యాంకు సాధించాడు. జగదీశ్వరరావు రెండో కుమారుడు అయిన వినయ్ చిన్ననాటి నుంచే చదువులో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాడు. పదో తరగతిలో పదికి 9.8 శాతం మార్కులు, ఇంటర్మీడియెట్లో 1000కి 986 మార్కులు సాధించాడు. పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో నిట్లో బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) పూర్తి చేసి, పదికి 8.8 శాతం మార్కులు దక్కించుకున్నాడు. యూపీఎస్సీలో మూడోసారి ప్రయత్నించి 274వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఇదంతా తన తల్లిదండ్రుల సహకారం, ప్రోత్సాహంతో సాధించానని వినయ్ చెబుతున్నాడు. జగదీశ్వరరావు మొదటి కుమారుడు సాయి సంతోష్ ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం జర్మనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వినయ్ తల్లి దుర్గ గృహిణి.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే విజయం
యూపీఎస్సీ 94 ర్యాంకర్ స్నేహిత్

ఐపీఎస్ అధికారిగా సమాజ సేవ చేస్తా

ఐపీఎస్ అధికారిగా సమాజ సేవ చేస్తా