
తల్లి ఒడికి చేరిన తనయ
ఫ పరంధామానికి చేరిన శ్రీరాముడు
ఫ ముగిసిన ఉత్తరకాండ ప్రవచన సప్తాహం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): చతుర్విధ పురుషార్థ సాధనకు రామాయణాన్ని మించిన కావ్యం లేదని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఎన్ని కావ్యాలున్నా, వాటిలో అత్యుత్తమమైనది రామాయణమేనన్నది బ్రహ్మవాక్కు అని చెప్పారు. స్థానిక టి.నగర్లోని హిందూ సమాజంలో ఉత్తరకాండపై వారం రోజులుగా ఆయన నిర్వహిస్తున్న ప్రవచనాలు సోమవారం ముగిశాయి. ముగింపు ప్రవచనంలో రామావతార పరిసమాప్తిని వివరించారు. శ్ఙ్రీగోమతీ నదీ తీరాన రాముడు అశ్వమేధ యాగం చేస్తున్న సమయంలో వాల్మీకి మహర్షి ఆనతి మేరకు లవకుశులు రామకథను గానం చేశారు. వారు తన కుమారులేనని రాముడు గుర్తించాడు. సీతపై లోకాపవాదు తొలగించడానికి అశ్వమేధ యాగం జరుగుతున్న తరుణం సరైన సమయమని గుర్తించాడు. ఎందరో రాజులు, మహర్షులు, రాక్షస, వానర వీరులు తరలి వచ్చారు. వారందరి సమక్షాన సీతమ్మ శపథ పూర్వకంగా తన పాతివ్రత్యం నిరూపించాలని ఆయన వాల్మీకి మహర్షిని కోరాడు. మరుసటి రోజు ఉదయం బ్రహ్మదేవుని అనుసరించి వస్తున్న వేదమాతలా, వాల్మీకి మహర్షిని సీతాదేవి అనుసరించి అక్కడికి చేరుకుంది. శ్రీరామా! నా వేలాది సంవత్సరాల తపస్సు మీద ఆన పెట్టి చెబుతున్నాను. సీతాదేవి శుద్ధచరిత, నిష్కళంకశ్రీ అని ఆయన ప్రజల సమక్షంలో రామునితో చెప్పాడు. శ్రీమహర్షీ! సీతాదేవి పాతివ్రత్యం నాకు తెలుసు. లోకాపవాదు తొలగించడానికి నేను ఇటువంటి కోరిక కోరుతున్నానుశ్రీ అని రాముడు బదులిచ్చాడు. శ్రీత్రికరణశుద్ధిగా నేను రాముని తప్ప అన్యుని గురించి తలచకపోయి ఉంటే, భూదేవి నన్ను తనలోకి తీసుకుంటుందిశ్రీ అని సీతమ్మ శపథం చేస్తుంది. సీత మాట పూర్తయిన వెంటనే దివ్య సింహాసనం మీద భూదేవి వచ్చి సీతాదేవిని రసాతలంలోకి తీసుకు వెళ్లింది. శ్రీసాగరం ఆవల ఉన్న సీతాదేవిని తీసుకు వచ్చిన నాకు సీతను వెంటనే అప్పగించకపోతే, ధరాతలాన్ని నాశనం చేస్తానుశ్రీ అని రాముడు ప్రకటించాడు. బ్రహ్మాది దేవతలు రామునితో సాంత్వన వచనాలు పలికి ఆయన నిగ్రహించారుశ్రీశ్రీ అని సామవేదం వివరించారు. శ్ఙ్రీప్రజారంజకంగా 11 వేల సంవత్సరాలు పరిపాలించిన రాముని వద్దకు కాలపురుషుడు వచ్చాడు. ‘నీతో ఒక రహస్యం మాట్లాడాలి. ఈ సమయంలో ఎవరూ మన వద్దకు రారాదు’ అని ఆయన చెబుతాడు. రాముడు లక్ష్మణుడిని పిలిచి, ‘మా సమావేశం అయ్యేంత వరకూ ఎవ్వరినీ పంపవద్దు. నా ఆజ్ఞను ఉల్లంఘించిన వాడు నా చేతిలో వధ్యుడు’ అని చెబుతాడు. అయితే, దుర్వాస మహర్షిని ఆపలేకపోవడంతో మహర్షుల సూచనపై లక్ష్మణునికి మరణంతో సమానమైన బహిష్కరణను రాముడు విధించాడు. సీత లేని రాముని ఊహించవచ్చును. ‘లక్ష్మణుడు లేని రాముని ఊహించలేము’ అని సామవేదం అన్నారు. ‘కాలపురుషుని ద్వారా బ్రహ్మ సందేశాన్ని తెలుసుకున్న రాముడు సరయూ నది ద్వారా పరంధామానికి చేరుకున్నాడు. అంతకు ముందే ఆయన బహిష్కరించిన లక్ష్మణుడు పరంధామానికి చేరుకున్నాడు’ అని షణ్ముఖ శర్మ చెప్పారు. ఈ ప్రవచనాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

తల్లి ఒడికి చేరిన తనయ