ఆదిశిలా క్షేత్రంలో గంప జాతర | - | Sakshi
Sakshi News home page

ఆదిశిలా క్షేత్రంలో గంప జాతర

Aug 30 2026 1:09 AM | Updated on Aug 30 2026 1:09 AM

మల్దకల్‌: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం గంప జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి.. దశమికట్ట వరకు పల్లకీ సేవ చేపట్టారు. గ్రామ పురవీధుల్లో ఊరేగుతున్న స్వామివారిని భక్తజనం దర్శించుకొని భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. దేవరగట్టులోని ఆలయానికి చేరుకున్న స్వామివారికి ప్రత్యేక పూజ ల అనంతరం తిరిగి ఆదిశిలా క్షేత్రానికి చేర్చారు. ప్రతి ఏటా గంప జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ చైర్మన్‌ ప్రహ్లాదరావు తెలిపారు. ఈఓ సత్యచంద్రారెడ్డి, అర్చకులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement