ఆదిశిలాక్షేత్రంలో ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

ఆదిశిలాక్షేత్రంలో ప్రత్యేక పూజలు

Jul 12 2026 1:29 AM | Updated on Jul 12 2026 1:29 AM

మల్దకల్‌: స్వయంభూ ఆదిశిలా క్షేత్రమైన లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఈ సందర్భంగా అర్చకులు మధుసూదనాచారి, రవిచారి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి ఆలయాల్లోనూ భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి చంద్రశేఖర్‌రావు, సిబ్బంది రంగనాథ్‌, ఉరుకుందు, కృష్ణ, శివమ్మ, రాము, శ్రీను, చక్రి, వాల్మీకి పూజారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement